మేడ్చల్ లో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ లో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్మిక నగర్ కు చెందిన చిత్రశివాని.. కాప్రా సర్కిల్ సాయినగర్ లో డబుల్ బెడ్ రూం ఇంటిపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. 

చిత్రశివాని ECILలోని మేఘా కాలేజీలో డిగ్రీ చదువుతుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.