దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ కోసం ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్ గెలిచిన ముంబై ఒకవైపు.. తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు ఫైనల్లో తలపడునున్నాయి. ఈ తుది సమరంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపించాడు.
క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్పై సత్తాచాటిన జట్టునే కొనసాగిస్తున్నట్లు శ్రేయస్ చెప్పాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు.
టీమ్స్
A look at the Playing XI for the #Final of #Dream11IPL 2020 pic.twitter.com/lcK8ZRdB9Y
— IndianPremierLeague (@IPL) November 10, 2020