న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలను, పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నంలో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది దేశానికి మంచిది కాదని వివరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం పూర్తి అబద్ధమని, అందులో ప్రతిదీ నిరాధారమని స్పష్టంచేశారు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్అరెస్ట్పై ఆయన మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
గతంలో ఢిల్లీలో బస్సు కుంభకోణం, ఆ తర్వాత క్లాస్రూమ్ స్కామ్, విద్యుత్ కుంభకోణం, రోడ్ల నిర్మాణం, నీటి సరఫరాలో అవకతకవలు జరిగినట్లు బీజేపీ ఆరోపించినా ఏ ఒక్కటీ బయటకు రాలేదన్నారు. లిక్కర్ స్కామ్ కూడా కల్పితమని, డబ్బు మార్పిడి ఎక్కడా జరగలేదని అన్నారు. కోర్టులో చూపించడానికి దర్యాప్తు సంస్థల వద్ద ఎలాంటి ఆధారాల్లేవని కేజ్రీవాల్ మండిపడ్డారు.