
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్ రోడ్ను క్లోజ్ చేసింది. దీంతో హర్యానా – ఢిల్లీ బోర్డర్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సైకిళ్లపై పనులకు వెళ్లేవారు రోడ్డుపై బైఠాయించి బోర్డర్ను తెరవాలని డిమాండ్ చేశారు. తమను పనులకు వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. వాళ్లంతా రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగటంతో ఢిల్లీ–గుర్గావ్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్లోనే కేసులు అధికంగా ఉన్నాయని, అందుకే కేవలం నిత్యావసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతిస్తున్నామని హర్యానా మినిస్టర్ అనిల్ విజ్ చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాకు వచ్చే వారి వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.