ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు

ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్  ఆరోరా, రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారడంతో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది.  ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారనుంది.  

చల్లబడిన కనిపించిన కేసు మళ్లీ తెరపైకి రావటం కలకలం రేపుతుంది. ఇప్పటికే కవిత ఓసారి ఈడీ విచారణకు వెళ్లి వచ్చారు. రెండు రోజులు హాజరయ్యారు. అప్పట్లోనే కవిత అరెస్ట్ అంటూ వార్తలు వచ్చినా.. అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం అటకెక్కినట్లు అందరూ అనుకుంటున్న టైంలో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించి.. ఎన్నికలకు సిద్ధం అయిన క్రమంలో.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు పంపించటం అనేది చర్చనీయాంశం అయ్యింది.

2023, మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజులు కవితను రోజంతా విచారించారు. అప్పట్లో ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత.. రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. కవిత విచారణ ముగిసింది అనుకుంటున్న సమయంలో.. మళ్లీ విచారణకు పిలవటం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ చెప్పిన.. పిలిచిన సమయానికి హాజరు అవుతారా లేదా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్..