- ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్ ప్రకటించారు. నలుగురైదుగురు టెర్రరిస్టులు ఢిల్లీలోకి చొరబడి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.15 జిల్లాల పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, స్పెషల్సెల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హాస్పిటల్స్, మార్కెట్ ఏరియాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ దగ్గరే జనం ఎక్కువ ఉంటారని, అందుకే హాస్పిటల్స్పై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు చెప్పారు. గెస్ట్ హౌస్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.