ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్తారా విమానానికి చెందిన జీఎంఆర్ కాల్సెంటర్కు ఆగస్టు 18న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
ఫ్లైట్లో బాంబు పెట్టామని బెదిరించారు. అధికారులు వెంటనే స్పందించి విమానం ఎగరకముందే తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఫేక్కాల్ అని తేలడంతో విమానం ఎగరడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తనిఖీల సందర్భంగా జరిగిన ఆలస్యం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారిని శాంతింపజేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఉదయం 7.30 కి బెదిరింపు కాల్వచ్చినట్లు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు వివరించారు. బెదిరింపులకు పాల్పడిన వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.