- రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ అమ్మిన కీలక నిందితులు అరెస్ట్
- మీడియా వివరాలు వెల్లడించిన మాదాపూర్జోన్ డీసీపీ వినీత్
గచ్చిబౌలి, వెలుగు: రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబరాబాద్పోలీసులు అరెస్ట్చేశారు. వారి వద్ద రూ. కోటి విలువైన11 గ్రాముల ఎండీఎంఏ, 7 సెల్ఫోన్లు, ఒక జాగ్వార్కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీస్లో మాదాపూర్జోన్ డీసీపీ వినీత్మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్కు చెందిన సయ్యద్అబ్దుల్రెహ్మన్(27) ఈజీ మనీ కోసం డ్రగ్స్అమ్ముతున్నాడు. గోవాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్టై జైలులో ఉన్న ఫైజల్, మరికొందరితో కలిసి హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల్లో పబ్ లకు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్అమ్ముతూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు.
అబ్దుల్రెహ్మన్ ఢిల్లీ నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ను తీసుకొచ్చి సిటీలో పబ్లకు వచ్చే వారికి అమ్ముతున్నాడు. ఇతనిపై ఇప్పటికే 6 కేసులు ఫైల్ నమోదు అవగా.. తప్పించుకొని తిరుగుతుండగా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలి రాడిసన్హోటల్లో జరిగిన డ్రగ్స్పార్టీలో పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్కేసు దర్యాప్తులో భాగంగా ఓల్డ్ సిటీకి చెందిన మీర్జా వహీద్బేగ్వద్ద డ్రగ్స్ కొన్నట్టు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.
అతడికి అబ్దుల్రెహ్మన్ డ్రగ్స్అమ్మినట్లు తేలింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్రెహ్మన్ కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. అతడికి సహకరించే ఢిల్లీలోని మహిపాల్పురాకు చెందిన మిలాన్సి. నరేంద్ర సీవనత్(27)ను కూడా అరెస్ట్ చేశారు. వీరు పబ్ ల్లో అధిక ధరకు డ్రగ్స్అమ్మి వచ్చిన డబ్బుతో ఖరీదైన కార్లు, సెల్ఫోన్లు కొనుగోలు చేసి జల్సాలు చేసేవారని మాదాపూర్జోన్ డీసీపీ వినీత్వివరించారు.