ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను ఆమె ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అక్టోబర్ 27న రాత్రి నంబర్ ప్లేట్ లేని బైక్ వెళ్లి ఆమె ఫ్యామిలీ ముందే ఆ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు
పోలీసుల వివరాల ప్రకారం .. జైత్పూర్ ఎక్స్టెన్షన్లోని ఏక్తా విహార్ ప్రాంతానికి చెందిన పూజా యాదవ్ అనే మహిళకు రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ ప్రధాన్ తో వివాహేతర సంబంధం ఉంది. కృష్ణ ప్రధాన్ కు అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలున్నారు. ఈ విషయంపై అతని ఇంట్లో నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. దీంతో పూజా యాదవ్ ను ఎలాగైనా చంపాలనుకుని ప్లాన్ వేశాడు కృష్ణ ప్రధాన్ సోదరుడు రాకీ. దీంతో జైత్పూర్ ఎక్స్టెన్షన్లోని ఏక్తా విహార్ ప్రాంతంలో తన తల్లిదండ్రులు తమ్ముడితో నివసిస్తున్న పూజ ఇంటికి వెళ్లాడు రాకీ. నంబర్ ప్లేట్ లేని బైకుపై వెళ్లి అక్టోబర్ 27న రాత్రి పూజా యాదవ్ ను ఆమె ఇంట్లోనే ఆమె సోదరుడు .. తల్లి ముందే కాల్చి చంపాడు. ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. బైక్ ను అక్కడే వదిలి పరారయ్యాడు.
పూజ బయట పిల్లలతో ఆడుకుంటుండగా, మోటార్ సైకిల్పై వచ్చిన ఓ వ్యక్తి పూజ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని ఆమె సోదరుడు పోలీసులకు చెప్పాడు. అయితే బైక్ ఇంజన్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ బైక్ను నరేందర్ అనే వ్యక్తిదని గుర్తించగా.. అతను దానిని శుక్రవారం రాకీకి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తర్వాత నిందితుడు పరారయ్యాడని.. అతడి లొకేషన్ ను ట్రాక్ చేసి అరెస్ట్ చేశామన్నారు. అయితే పూజ హత్య కేసులో రాకీ ఒక్కడిదే ప్రమేయం ఉందా? లేక అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు.