ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు కరోనా నెగిటివ్ అని తేలింది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో సత్యేంద్ర జైన్ సోమవారం ఆసుపత్రిలో చేరారు. అక్కడి డాక్టర్లు ఆయనకు కోవిడ్-19 పరీక్షలు చేయగా… నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ, పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం జరిగిన అఖిలపక్షం సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్ర జైన్ కు జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఆయన్ను సోమవారం రాత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు కరోనా టెస్టులు చేసి వైరస్ సోకలేదని చెప్పారు.