లింగంపేట, వెలుగు: పట్టా మార్పిడికి లంచం తీసుకుంటుండగా ఆర్ఐను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కొర్పొల్గ్రామానికి చెందిన ఉస్మాన్, నూరోద్దిన్, సమ్మియోద్దిన్1972లో నాగారం గ్రామ శివారులో 17 ఎకరాల 32 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 2016లో రెవెన్యూ ఆఫీసర్లు సమగ్ర భూ ప్రక్షాళనలో 128 సర్వే నంబర్లోని 1.10 గుంటల భూమిని లింగంపేట గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి అనే వ్యక్తి పేరిట రెవెన్యూ ఆఫీసర్లు పట్టా అందించారు. విషయం తెలుసుకున్న ఉస్మాన్ కుమారుడు మహ్మద్బషీరోద్దిన్అలియాస్సలీం తమ భూమిని అతని పేరిట ఎలా పట్టా చేస్తారని రెవెన్యూ ఆఫీసర్లను అడుగగా తమకు తెలియదంటే తమకు తెలియదని అన్నారు.
ఈ క్రమంలో సంతోష్రెడ్డి ఆ భూమిని ఐలాపూర్ గ్రామానికి చెందిన బెజుగం దేవేందర్అనే వ్యక్తికి విక్రయించాడు. దీంతో సలీం పోలీసులను ఆశ్రయించాడు. చివరకు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా రూ.1.5 లక్షలు దేవేందర్కు చెల్లించి భూమిని పట్టా చేయించుకోవాలని నిర్ణయించారు. సలీం పెద్దల నిర్ణయం ప్రకారం డబ్బులు చెల్లించి దేవేందర్నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ భూమిని తన పేరు మీద పట్టా మార్పిడి చేయాలని లింగంపేట ఆర్ఐ సుభాశ్ను కోరగా రూ.4500, స్మార్టు ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో బుధవారం రూ. 3 వేలు, ఫోన్తీసుకుంటున్న ఆర్ఐ సుభాశ్ను ఏసీబీ ఆఫీసర్లు పథకం ప్రకారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.