- మనదేశం ఎగుమతులను బ్యాన్ చేయడంతో.. ఆ దేశానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆర్డర్స్ పెరిగి కాసులపంట
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్కు మన దేశం తీసుకున్న నిర్ణయం కలిసివచ్చింది. వచ్చే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని బాస్మతి రైస్ మినహా.. బియ్యం ఎగుమతులను మనదేశం నిలిపివేసింది. దీంతో చాలా దేశాల్లో రైస్ కొరత ఏర్పడింది. ఇది కాస్త పాకిస్తాన్కు కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆ దేశ బియ్యానికి ప్రపంచ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కంపెనీలకు ఆర్డర్స్ విపరీతంగా పెరిగాయని పాక్ రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ చెలా రామ్ కెవ్లానీ మీడియాకు తెలిపారు. ఇంటర్నేషనల్ కొనుగోలుదారులు పాక్ ఎగుమతిదారులవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అమెరికా, బ్రిటన్తో పాటు యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరిగిందన్నారు. కాగా, మనదేశం బియ్యం ఎగుమతి బ్యాన్ చేయకముందు పాక్ బియ్యం టన్నుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో రూ.37,257 ఉండగా.. ఇప్పుడది రూ.41,400కు పెరిగింది. కొద్దిరోజుల్లో అది రూ.50,000కు కూడా పెరగవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.