
న్యూఢిల్లీ: ఐసీసీ క్రికెట్ టీవీ బ్రాడ్కాస్ట్ రైట్స్ అగ్రిమెంట్ ప్రకారం స్టార్ ఇండియా నడుచుకోలేదని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఆరోపించింది. వాల్ట్ డిస్నీకి చెందిన ఈ కంపెనీ నుంచి రూ.68.54 కోట్ల రిఫండ్ను డిమాండ్ చేసింది.
ఐసీసీ మెన్స్, అండర్ 19 ఇంటర్నేషనల్ మ్యాచుల టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ను 2024–2027 కాలానికి గాను సబ్లైసెన్స్ పొందేందుకు ఈ ఇరు కంపెనీలు అలయెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అవసరమైన అనుమతులు పొందడంలో, అగ్రిమెంట్ను అమలు చేయడంలో స్టార్ ఇండియా ఫెయిలైందని జీ పేర్కొంది.
అగ్రిమెంట్ ప్రకారం, రైట్స్ ఫీజులు రూ.1,693.42 కోట్లలో మొదటి ఇన్స్టాల్మెంట్ను చెల్లించలేదని జీ కి కిందటేడాది డిసెంబర్ 31 న స్టార్ ఇండియా లీగల్ లెటర్స్ పంపిన విషయం తెలిసిందే. బ్యాంక్ గ్యారెంటీల కోసం అదనంగా రూ.17 కోట్లను కూడా ఈ కంపెనీ డిమాండ్ చేసింది.