మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు : మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్​ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే కనీస వేతనం ఇవ్వడం లేదని, కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సబ్బులు, నూనెలను రెగ్యులర్​గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే 

పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, మైపాల్ యూనియన్ అధ్యక్షుడు దశరథ్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు