వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‭కు అనుమతి నిరాకరణ

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‭కు అనుమతి నిరాకరణ

వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‭కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‭లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కాని ఈ వేడుకకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. అయితే ఏపీ పోలీసుల సూచనతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని వీరసింహారెడ్డి పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాయి. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‭లో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‭‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్‭లో మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది.