నలుగురు మంత్రులు కలిస్తే తప్పేంటి.? బహిరంగంగా వెళ్తే రహస్యం ఎలా అవుతుంది.?

నలుగురు మంత్రులు కలిస్తే తప్పేంటి.? బహిరంగంగా  వెళ్తే రహస్యం ఎలా అవుతుంది.?

హైదరాబాద్: మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాభవన్ లో సమావేశంలో మంత్రులు పరిపాలన. ఎన్నికలకు సంబంధించి మాట్లాడారని భట్టి క్లారిటీ ఇచ్చారు. సీఎం అం దుబాటులో లేకపోవడంతో తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సీఎం, మంత్రులందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. నలుగురు మంత్రులు సమావేశమైతే తప్పేంటి? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ 'రహస్య భేటీ' అంటూ విష ప్రచారం చేయడం తగదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

'ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించుకుంటే అందులో తప్పేముంది? అది ప్రభుత్వ సమష్టి బాధ్యత. లోకభవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లాం. రాబోయే మున్సిపల్ ఎన్నిక ల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్న ద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు. వ్యక్తిత్వ హననానికి, ఊహా జనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అన్నారు.