- టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ పరిశీలన
హైదరాబాద్, వెలుగు: కరెంట్ఆఫీస్కు వచ్చే ఉద్యోగులు, వినియోగదారులకు రుచికరమైన ఆహారం అందించాలని మహిళాశక్తి క్యాంటిన్నిర్వాహకులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం హైదరాబాద్మింట్ కాంపౌండ్లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మహిళాశక్తి క్యాంటీన్'ను ఆయన పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన ఖర్చు, ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల వసతులు, మౌలిక సౌకర్యాల గురించి సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగులు, సందర్శకులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని క్యాంటీన్నిర్వాహకులకు సూచించారు. అనంతరం క్యాంటీన్లో ఏర్పాటు చేసిన మెనూ బోర్డు, ధరల పట్టికను ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం వెంట సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్పీడీసీఎల్
డైరెక్టర్లు ఉన్నారు.
