హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను డిప్యూటీ సీఎం భట్టి పరామర్శించారు.
ఈ సందర్భంగా వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. భట్టి వెంట ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజ్మతుల్లా తదితరులు ఉన్నారు.