కాసీపేట-2 బొగ్గు గనిలో డిటోనేటర్ మిస్ ఫైర్..నలుగురు కార్మికులకు గాయాలు

కాసీపేట-2 బొగ్గు గనిలో డిటోనేటర్ మిస్ ఫైర్..నలుగురు కార్మికులకు గాయాలు

కోల్​బెల్ట్, వెలుగు : డిటోనేటర్ పేలడంతో నలుగురు సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట-2 బొగ్గు గనిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మధ్యాహ్నం గనిలోని నార్త్​డిస్ర్టిక్ట్​, 22 లెవల్, 18 ఎక్స్​డిప్ ప్రాంతంలో మ్యాన్​హోల్స్ (ప్రమాదాల నుంచి తప్పించుకొని రక్షణగా ఉండే స్థలం) ఏర్పాటు కోసం కోల్​కట్టర్​కార్మికులు రమేశ్, పుప్పాల శ్రీనివాస్, రాజ్​కుమార్, సపోర్ట్​మెన్​క్రాంతి కుమార్​బ్లాస్టింగ్​పనులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ డిటోనేటర్​మిస్​ఫైర్​కావడంతో బొగ్గు పెళ్లలు, బొగ్గు చూర నలుగురికి తగలడంతో గాయాలయ్యాయి. కార్మికులను ముందుగా మందమర్రి కేకే డిస్పెన్సరీకి అనంతరం రామకృష్ణాపూర్​సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, కార్మిక సంఘాల లీడర్లు పరామర్శించారు. ఇద్దరు కార్మికులను కరీంనగర్, హైదరాబాద్​కు తరలించారు.