
మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పర్యటించారు . చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్మ బొజ్జు లు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఆదివాసి కార్మిక సంఘానికి మద్దతు పలికారు. ఈ సందర్బంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఆదివాసీకార్మిక సంఘం తరపున మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావు పోటీచేస్తున్నారని.. వారిని గెలిపించాలని సిమెంట్ కంపెనీ కార్మికులను కోరారు.
ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటూ... బి ఎఫ్ ఆర్ లో ఉన్న సింగరేణి సంస్థను మూతపడకుండా లక్ష ఉద్యోగాలు కాపాడిన ఘనత కాక వెంకటస్వామిదన్నారు.కార్మికుల కోసం కొట్లాడిన ఫ్యామిలీ మాది .. కార్మికుల హక్కుల కోసం పని చేస్తామన్నారు.సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్యలనుపరిష్కరిస్తామని.. ఆదివాసీ సంఘం తరపున పోటీ చేస్తున్న విక్రం రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మూతపడిన ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ ను ప్రారంభించేందుకు తమ తండ్రి కాకావెంకటస్వామి.. తాను ఎంతో కృషి చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ దందాలు,మట్టి,బియ్యం,ఇసుక దందాలు నడిచేవని.. ఇప్పుడు కాగ్రెస్ ప్రభుత్వంలో తాను చెన్నూరు ఎమ్మెల్యేగా.. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ గెలిచిన తరువాత త దందాలు,మాఫియాలు ఆగిపోయాయన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా దందాలు.. మాఫియాలు చేసే వాళ్లను ఎట్టి పరిస్థితిలో సహించమని స్పష్టం చేశారు.
సిమెంట్ కంపెనీ కార్మికులఅభివృద్దికి నిధులు తెస్తాం.. ఎమ్మెల్యే వినోద్
కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో జరిగే లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలలో పుస్కూరి విక్రమ్ రావు ను బలపరుస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో విక్రమ్ రావు ను బారి మెజార్టీ తో గెలిపించాలంటూ... కార్మిక సోదరులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఓరియంట్ కంపెనీ కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఆదివాసీలకు అవమానం జరిగింది: ఎమ్మెల్యే వెల్మ బొజ్జు ..
దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీలో ఆదివాసులు ఎక్కువ ఉన్నారు. బీఆర్ హయాంలో ఆదివాసీలు అవమానాలకు గురయ్యారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదివాసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. ఆదివాసి నాయకులు అందరూ ఐక్యతతో ఉండాలంటూ.. ఐక్యతతోనే ఏదైనా సాధించగలం.. విడిపోతే మనల్ని చులకన చూస్తారన్నారు.ఆదివాసి యూనియన్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్న విక్రమ్ కు సపోర్ట్ చేయాలని ఆదివాసి నాయకులకు పిలుపునిచ్చారు