చందానగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో శేరిలింగంపల్లి డెవలప్మెంట్ చేసేందుకు తాను బాధ్యుడిగా ఉంటానని కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ అన్నారు. గడపగడపకు రఘన్న కార్యక్రమంలో బుధవారం మియాపూర్ డివిజన్లోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్నగర్లోని పలు కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల కార్డుతో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘునాథ్యాదవ్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల పథకాల హామీలను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలనలో అవినీతి తప్పా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పథకాలను వివరించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.