ఆరు గ్యారెంటీలతో అభివృద్ధి ఖాయం : రఘునాథ్‌ యాదవ్

ఆరు గ్యారెంటీలతో అభివృద్ధి ఖాయం :  రఘునాథ్‌ యాదవ్

చందానగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ  పథకాలతో  శేరిలింగంపల్లి డెవలప్‌మెంట్‌ చేసేందుకు తాను బాధ్యుడిగా ఉంటానని కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ అన్నారు. గడపగడపకు రఘన్న కార్యక్రమంలో బుధవారం మియాపూర్‌‌ డివిజన్‌లోని నడిగడ్డ తండా, సుభాష్​ చంద్రబోస్​నగర్‌‌లోని ​పలు కాలనీల్లో  కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల కార్డుతో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘునాథ్​యాదవ్​ మాట్లాడుతూ.. రాష్ర్టంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల పథకాల హామీలను అమలు చేస్తామన్నారు.  ప్రస్తుతం బీఆర్‌‌ఎస్‌ పాలనలో  అవినీతి తప్పా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గడప గడపకు కాంగ్రెస్​ పథకాలను వివరించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
 పాల్గొన్నారు.