సెప్టెంబర్ 26 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు

సెప్టెంబర్ 26 నుంచి  దేవి నవరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శనివారం ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,116 చెల్లించిన దంపతులకు ఉత్సవాల్లో ప్రతిరోజు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా సప్తశతి పారాయణానికి రూ.116(ఒక్క రోజు మాత్రమే), లక్ష కుంకుమార్చనకు రూ.116(ఒక్కరోజు మాత్రమే) చెల్లించి పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్టోబర్ 5న నిర్వహించే ప్రత్యేక పూజలతో దేవి నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ రమాకాంత్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ మాథుర్ వేర్వేరుగా వారి ఫ్యామిలీలతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.