ఇంగ్లండ్‌‌‌‌తో తొలి వన్డేలో కివీస్‌‌‌‌ విక్టరీ

ఇంగ్లండ్‌‌‌‌తో తొలి వన్డేలో కివీస్‌‌‌‌ విక్టరీ

డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (91 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 118 నాటౌట్‌‌‌‌), డెవాన్‌‌‌‌ కాన్వే (121 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 111 నాటౌట్‌‌‌‌) సెంచరీలతో చెలరేగడంతో 2019 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ తర్వాత  ఇంగ్లండ్‌‌‌‌తో మొదటి వన్డే  సిరీస్‌‌‌‌ను న్యూజిలాండ్‌‌‌‌ ఘన విజయంతో ఆరంభించింది.  నాలుగు వన్డేల సిరీస్‌‌‌‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

తొలుత ఇంగ్లండ్‌‌‌‌ 50 ఓవర్లలో 291/6 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌ బట్లర్‌‌‌‌ (72), డేవిడ్‌‌‌‌ మలన్‌‌‌‌ (54), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (52), లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (52) ఫిఫ్టీలు కొట్టారు. రాచిన్‌‌‌‌ రవీంద్ర మూడు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌, కాన్వే జోరుతో కివీస్‌‌‌‌ 45.4 ఓవర్లలో 297/2 స్కోరు ఈజీగా గెలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.