
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గోశాల కోసం హైదరాబాద్కు చెందిన అల్లు వెంకట ఫణికిరణ్ అనే భక్తుడు మంగళవారం విరాళం ఇచ్చారు. ఈవో దామోదర్రావు చేతుల మీదుగా రూ.1,01,116ను అందజేశారు. మిథిలాస్టేడియం వెనుక జరుగుతున్న ప్రసాద్ స్కీం పనులను ఈవో తనిఖీ చేశారు. జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.