
వేములవాడ, వెలుగు: ఆషాడ మాసం షురూ కావడంతో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మొన్నటిదాకా భక్తులతో ఆలయం రద్దీగా కనిపించింది. ఆలయ అభివృద్ధి పేరుతో మూసి వేస్తారని ప్రచారం జరగడంతో స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
దర్శనం కోసం గంటల తరబడి క్యూ కట్టారు. ఆషాడమాసం ప్రారంభం కావడంతో భక్తులు రాక తగ్గిపోవడంతో నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు.