వారాహి నవరాత్రి ఉత్సవాల్లో అలరించిన నృత్య ప్రదర్శన

వారాహి నవరాత్రి ఉత్సవాల్లో అలరించిన నృత్య ప్రదర్శన

కామారెడ్డిటౌన్, వెలుగు: వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రం ఎన్జీవోస్​కాలనీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగావరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పుష్పార్చన తదితర పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కీర్తనలతోపాటు విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.