హైదరాబాద్ ఆలయాల్లో శ్రావణ శోభ

హైదరాబాద్ ఆలయాల్లో శ్రావణ శోభ

పద్మారావునగర్/దిల్​సుఖ్​నగర్​/ మేడిపల్లి, వెలుగు : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భవిష్యవాణిలో అమ్మవారు కోరినట్లుగా సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళికి పప్పు, బెల్లంతో చేసిన 21 సాకలను పండితులు సమర్పించారు. భక్తులు తమ ఇండ్ల నుంచి తెచ్చిన సాకలను పోశారు.

 ఎల్బీనగర్ ఆర్‌‌‌‌‌‌‌‌కె పురం అష్టలక్ష్మి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోడుప్పల్​లోని నిమిషాంబికా దేవి ఆలయంలో 1,116 చీరల అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ అలంకరణ ఆదివారం వరకు కొనసాగుతుందని, శ్రావణ మాసంలో ప్రతిరోజు విభిన్న అలంకరణలతో దర్శనం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు.