ఆధ్యాత్మికం: అర్జునుడికి ఎంతమంది భార్యలు.. వారి తల్లుల చరిత్ర ఇదే..!

ఆధ్యాత్మికం:  అర్జునుడికి ఎంతమంది భార్యలు.. వారి తల్లుల చరిత్ర ఇదే..!

 మహాభారత ఇతిహాసంలో  అంతగా ప్రస్తావించని వారుకూడా ఉన్నారు.  పురాణాల ప్రకారం..  అర్జునుడికి మొత్తం నలుగురు భార్యలు ఉన్నారు. వారిని అర్జునుడు ఏ సందర్భంలో వివాహం చేసుకున్నాడు.  అర్జునుడి అత్తగార్ల చరిత్ర.. వారి ప్రాముఖ్యత ఏమిటి... ఈ స్టోరీలో తెలుసుకుందాం...

హిందూ పురాణాల్లో  మానవ జన్మ.. మతం.. న్యాయం.. ధర్మం ఇలాంటి అనేక విషయాలను మహాభారతం ద్వారా  తెలుస్తుంది.  ఈ ఇతిహాసంలోని ప్రతి పాత్రకు ప్రత్యేక స్థానంతో పాటు ప్రాముఖ్యత కూడా ఉంది.  ఇక పాండవులలో ధర్మరాజు అగ్రజుడైనా... వారి గురించి చెప్పేటప్పడు అందరూ అర్జునిడి గురించే చెబుతారు.  ఇతని ధైర్యం.. పరాక్రమం అంతా కాదు.. అందుకే ఉత్తమ విలుకారుడిగా శ్రీకృష్ణుడు గుర్తించాడు.  పాండవుల భార్య ఎవరంటే ద్రౌపది.. ఈ విషయం అందరికి తెలిసిందే.. కాని పురాణాల ప్రకారం అర్జునుడికి ద్రౌపదితో పాటు..  సుభద్ర... ఉలుపి ... చిత్రాంగద అనే నలుగురు భార్యలు ఉన్నారు.

అర్జునుడి  మొదటి భార్య ద్రౌపది: కురక్షేత్ర యుద్దం జరిగిందంటే దానికి కారణం పాండవుల భార్య ద్రౌపది.  మహాభారత కాలంలో  ఈమె పాత్ర చాలా ముఖ్యమైనది.  ఆమె పాంచాల దేశ రాజు   ద్రుపదుడు.. మహారాణి ప్రిష్టి దంపతులకు జన్మించింది. పంచ పాండవులను వివాహం చేసుకున్నా.. అర్జునుడే ప్రధానమని చెబుతుంటారు.  ద్రౌపది స్వయంరంలో అర్జునుడు విజయం సాధించాడు. ఆ తరువాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు.. తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా కుంతి పరధ్యానంలో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది. దీనితో.. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లాడుతారు. ఆ తరువాత కుంతి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయినా.. ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యతగా మెలిగేది.   ద్రౌపది తల్లి మహారాణి ప్రిష్టి శక్తివంతమైన ... గౌరవనీయమైన రాణిగా గుర్తింపు పొందారు.

అర్జునుడి  రెండవ భార్యసుభద్ర: వాసుదేవుడు.. రోహిణి లకు జన్మించిన సంతానమే సుభద్ర.. ఈమె శ్రీకృష్ణుని సోదరి.  రోహిణి అర్జునుడి అత్తగారు. మహాభారతం ప్రకారం... రోహిణి చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగించింది.  ఆమె బలరామడు.. సుబధ్రలను ఎంతో అల్లారుముద్దుగా... ప్రేమగా పెంచింది. అర్జునుడు సుభద్రను అపహరించి వివాహం చేసుకున్నప్పుడు, రోహిణి  ఒప్పుకుంది.  ఇదంతా తరువాత భవిష్యత్​ తరాలకు మంచిని అందించేందుకు జరుగుతుందని ఆమె  అంగీకరించిందని పండితులు  చెబుతున్నారు.

అర్జునుడి మూడవ భార్య ఉలుపి:  ఉలుపి ...నాగరాజ్యానికి చెందిన  కౌరవ్యుడి.. నాగమాతల  కుమార్తె.  ఉలుపి  నాగ లోకానికి యువరాణిగా ఉన్నారు.  వీరి ప్రస్తావన మహాభారత కాలంలో  ప్రాచుర్యంలో లేదు. పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేసే సమయంలో అర్జునుడు గంగానదిలో స్నానం చేసేటప్పుడు...ఉలుపి.. అర్జునుడిని  నాగలోకానికి లాక్కొని వెళ్లి  వివాహ ప్రతిపాదన చేసి.. పెళ్లి చేసుకుంది.  

అర్జునుడి నాలుగవ భార్య చిత్రాంగద:  అర్జునుడి నాలుగవ వివాహం మణిపూర్ రాజు చిత్రవాహనుడి కుమార్తె చిత్రాంగదతో జరిగింది. వీరి ప్రస్తావన మహాభారతంలో లేదు.  పాండవులు వనవాసం చేసే సమయంలో  మణిపూర్​ చేరుకున్నప్పుడు  తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని మణిపూర్​ రాజు చిత్రవాహనుడు కోరాడు.  ఆయన కోరిక మేరకు చిత్రాంగదను ప్రేమించి పరిణయమాడాడు.  అయితే పెళ్లి చేపుకొనేటప్పుడు చిత్రాంగదకు ఒక షరతు పెట్టాడు అర్జునుడు . నీవు ఇక్కడే ఉండాలని.. మనకు పుట్టిన కుమారుడు భవిష్యత్తులో మణిపూర్​ కు రాజుకావాలని ప్రతిపాదించాడు.