
ప్రస్తుతం జనాలు థ్యాంక్స్...థ్యాంక్యూ అనే మాటను అనేక సందర్భాల్లో వింటుంటాం.. మనం కూడా ఇతరులకు థ్యాంక్స్ చెబుతుంటాం.. ఈ మాటకు తెలుగులో కృతఙ్ఞత అని అర్దం.. ఈ పదం ఇప్పటిది కాదని.. త్రేతా యుగం నాటి నుంచి వాడుకలో ఎప్పటి నుంచి వాడులకలో ఉందని కొన్ని ఆథ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అసలు కృతఙ్ఞత అంటే ఏమిటి.. పురాణాల్లో దీని గురించి ఏమని విశ్లేషించారో తెలుసుకుందాం. .
కృతఙ్ఞత అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం అని అర్దం . మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో... ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో.. మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. అలా సహాయ పడిన వారిని గౌరవించడమే కృతఙ్ఞత అంటారు.
వాల్మీకి రామాయణం గురించి వివరించే సమయంలో... రాముణ్ణి వర్ణిస్తూ ...ధర్మఙ్ఞశ్చ , కృతఙ్ఞశ్చ అని గ్రంథంలో రాశారు. సీతమ్మను అపహరించుకొని పోతున్న రావణునితో పోరాడి ... ఆ సమాచారాన్ని రామునికి చెప్పి... ప్రాణాలు కోల్పోయిన జఠాయువుకు రాముడు కృతఙ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు.
రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం - ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేవిధంగా... అక్కడి నదులలో నిరంతరం సాధు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు... ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన రాముని కృతఙ్ఞతా లక్షణం.
►ALSO READ | వాతావరణ జ్యోతిష్యం : జూలై 15లోపు ఏపీ, ఒడిశాల్లో తుఫానులు వస్తాయా..?
మహా భారతంలో - దగ్ధమైన లక్క గృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్న కుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించింది. అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో - ... ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం... దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం... వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం.... అంటుంది.
ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం.... అనే చందంగా కాకుండా.... మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతఙ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి ... విధి శాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో... అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత అవుతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.
ఒక బోయవాడు వేటకు వెళ్ళి .....ఘనతర విషదగ్ధ శరం... తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా ,దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది.
దీనిని గమనించిన ఇంద్రుడు మానవుని రూపంలో దాని దగ్గరకు వెళ్ళి ...ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు?" అని అడిగాడు.
అపుడాశుకం ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అని చెప్పింది. తాను మనుషరూపంలో వచ్చినా ... పురాకృత సంజనిత విశేషము... చేత ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగింది. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్య పోయి నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు. అపుడామహాశుకం ఈ వృక్షానికి ...మేలుచెయ్యి చాలు ..అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను , ఫలసంపదను కలుగజేశాడు.
మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది నాగరక సంస్కారమని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తుంది. .