ఎయిర్ ఇండియాకు రూ.80లక్షలు ఫైన్

ఎయిర్ ఇండియాకు రూ.80లక్షలు ఫైన్

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)  నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా సంస్థపై జరిమానా విధించింది. విశ్రాంతి ఇవ్వకుండా పైలట్లకు డ్యూటీలు వేస్తూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ మరియు ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు రూ.80లక్షలు ఫైన్ విధించింది.


DGCA ఎయిర్ ఇండియా విమానంలో అడిట్ నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు 60 సంవత్సరాలకు మించి వయసున్న వారు ఉన్నారని తేలింది. అంతేకాదు పైలట్ల డ్యూటీ, ట్రిప్‌ల తర్వాత, ముందు రెస్ట్  ఇచ్చే విషయంల్లో రూల్స్ ఫాలో కాలేదని DGCA రూ.80లక్షలు ఫైన్ విధించింది. సివిల్ ఏవియేషన్ భద్రత పెంచడానికి కఠిన చర్యలు తీసుకుంటామని DGCA తెలిపింది.