
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్ఆఫ్సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్రమాదంలో క్రూ షెడ్యూలింగ్ లోపాలను గుర్తించిన డీజీసీఏ, ముగ్గురు సీనియర్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించాలని ఆ సంస్థను ఆదేశించింది. పది రోజుల్లోగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని రిపోర్టు చేయాలని అందులో పేర్కొంది. ఆదేశాలు అమలు చేయని పక్షంలో ఎయిర్ ఇండియా ఆపరేటింగ్ లైసెన్స్ను రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. డీజీసీఏ తన ఆడిట్ రిపోర్టులో, ఎయిర్ ఇండియా క్రూ షెడ్యూలింగ్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, అంతర్గత నియంత్రణ, జవాబుదారీతనంలో లోపాలు ఉన్నాయని పేర్కొంది.
ఈ లోపాలు విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించాయని తేల్చింది. అయితే వారి చర్యలు అహ్మదాబాద్ ప్రమాదంతో నేరుగా సంబంధం ఉన్నాయా? లేదా? అనేది డీజీసీఏ స్పష్టంగా తెలపలేదు. మరోవైపు ఎయిర్ ఇండియా తన 33 బోయింగ్ 787 విమానాల్లో 26 విమనాల తనిఖీలు పూర్తయ్యాయని, అవి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. అలాగే అయితే ‘‘డీజీసీఏ ఆదేశాలను మేం అంగీకరించాము.. వాటిని అమలు చేసాము. అలాగే కంపెనీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్.. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఐవోసీసీ) ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్, స్టాండర్డ్ప్రాక్టీసెస్ కుపూర్తిగా కట్టుబడి ఉంటాం’’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన రిలీజ్ చేసింది.