మాదాపూర్, వెలుగు: ఎండాకాలంలో జరిగే అగ్ని ప్రమాదాలపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట ఫైర్ సర్వీస్ డైరెక్టర్(డీజీఎఫ్ఎస్) జనరల్ వై. నాగిరెడ్డి సూచించారు. సోమవారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
రాబోయే రోజుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై జిల్లా ఫైర్ అధికారుల తో చర్చించారు. 15 రోజులుగా బేసిక్ ఫ్లడ్రెస్య్కూ, రోప్ రెస్క్యూలపై ట్రైనింగ్ తీసుకుంటున్న 72 మంది సిబ్బంది శిక్షణ పూర్తి కావడంతో వారిని అభినందించారు. వీరి సేవలను జిల్లాల్లో ఫైర్ అధికారులు ఉపయోగించుకోవాలని సూచించారు.