క‌రోనాను ఓడించడంలో అందరం భాగస్వామ్యం కావాలి

క‌రోనాను ఓడించడంలో అందరం భాగస్వామ్యం కావాలి

లాక్ డౌన్ విజయవంతం చేయడంలో ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి అని.. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరూ ఏకం కావాల‌న్నారు. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాల‌న్నారు. మానవ సమాజానికి ఒక ఛాలెంజ్ విసిరినటువంటి ఈ మహమ్మారిని ఓడించడంలో అందరం భాగస్వామ్యం కావాలన్నారు.

మన కుటుంబాన్ని, సహచరులను, మొత్తం సమాజాన్ని రక్షించడంలో లో మీరు అందిస్తున్న సహకారం ఎంతో గర్వకారణమ‌ని.. ఇకనుండి కూడా ప్రజలు పోలీసులకు సహకరించి, లాక్ డౌన్ ను పాటించాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుండి వేరే వారికి సోక కుండా పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.