ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ను అతను పోషించబోతున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇళయరాజా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్తో ‘వృషభ’ అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్న కనెక్ట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2025లో విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారట. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఒక సామాన్యుడిగా మొదలై.. తన సంగీతంతో కోట్లాదిమందిని అభిమానులుగా చేసుకున్న మ్యూజిక్ మ్యాస్ట్రో జీవితంలో ఎంతో సంఘర్షణ ఉంది. అదంతా తెరపై చూడాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఆయన బయోపిక్గా వస్తున్న ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి!