తమిళ హీరోలు ఇటీవల టాలీవుడ్లో మార్కెట్ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు. తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేస్తుండడంతో పాటు ఇక్కడి దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు ధనుష్. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇది విడుదల కాకముందే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో బైలింగ్వల్ మూవీ స్టార్ట్ చేశాడు. త్వరలో షూటింగ్ మొదలవనుంది.
ఇక తాజాగా మరో తెలుగు డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసిన రాధాకృష్ణ కుమార్.. ఇటీవల ధనుష్ను కలిసి ఓ స్టోరీ వినిపించాడట. కథ నచ్చడంతో అతనితో సినిమా చేసేందుకు ధనుష్ ఓకే చెప్పారని టాక్. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది. మరోవైపు తమిళంలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు ధనుష్. 1930 బ్యాక్డ్రాప్ పీరియాడిక్ డ్రామా ఇది. ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ హీరోయిన్స్గా నటిస్తోన్న ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్ కిషన్తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.