
పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వెంకటరమణ పసుపులేటి రూపొందిస్తున్న చిత్రం ‘ధర్మ చక్రం’. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ ‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా.
ఈ సినిమా ద్వారా నోటు రుచి మరిగిన వాళ్లకు పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుందనే సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ధర్మం గెలుస్తుంది అని మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.