‘ఢీ’ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో

‘ఢీ’ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో

ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మరణవార్త బుల్లితెరను షేక్ చేసింది. అప్పుల బాధ తట్టుకోలేకే చైతన్య నెల్లూర్ క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని చనిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. చనిపోయేముందు చైతన్య తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్  మీడియాలో  వైరల్ గా మారింది. ఈ వీడియోలో చైతన్య.. అప్పు ఇచ్చినవాళ్లు టార్చర్ పెడుతున్నారని, తల్లిదండ్రులను క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా తన ప్రాణాలను వదిలేశాడు

. ఈ వీడియోలో చివరలో చైతన్య చెప్పిన మాటలు ఎంతోమంది హృదాయాలను  కదిలించింది. “ఢీ నేమ్ ఇస్తుంది.. ఫేమ్ ఇస్తుంది కానీ, సంపాదన చాలా తక్కువ గా ఉంటుంది. జబర్దస్త్ లాంటి షోలో అయితే సంపాదన ఎక్కువ వస్తుంది. అయినా ఢీలోనే కష్టపడ్డాం, నిలబడ్డాం కానీ.. మేము కనీసం ఇల్లు, టీవీలు కూడా కొనుక్కోలేకపోయామని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ వీడియో చూసిన చాలా మంది మల్లెమాల సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో వల్గర్ కామెడీ తప్ప ఏం ఉండదు. కానీ ఢీలో కంటెస్టెంట్స్ కష్టపడి, కొత్త కొత్త స్టెప్స్ వేసి, చెమటోడ్చి జడ్జీలను ఎంత మెప్పించినా.. కనీసం నెలకు సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మరోపక్క... కామెడీ చేయడం అంత సులువు కాదని, వినోదాన్ని పంచే షోకు కొంచెం ఎక్కువ ఇచ్చిన పర్లేదని అంటూనే.. ఆపదలో ఉన్న కంటెస్టెంట్స్ ను ఆదుకోవడం మల్లెమాల బాధ్యత అని, చైతన్య కు మల్లెమాల సపోర్ట్ గా నిలిస్తే బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా.. చైతన్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, వారి కుటుంబానికి మల్లెమాల ఆర్థిక సహాయం అందిస్తే బావుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మరి నిజంగా  మల్లెమాల టీమ్ చైతన్య ఫ్యామిలీకి అండగా నిలబడుతుందా? లేదా? చూడాలి.