
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇటీవలే సినీ రంగంలో అడుగుపెట్టాడు. తన భార్య సాక్షితో కలిసి ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆయన సినిమాలు నిర్మించబోతున్నాడు. తాజాగా తమ బ్యానర్పై రూపొందబోతున్న ఫస్ట్ మూవీ టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి ఎల్జీఎం అనేక్రేజీ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ చెన్నైలోఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ధోని భార్య సాక్షి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. కొత్త దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాలో లవ్ టు డే హీరోయిన్ ఇవాన, తెలుగు జెర్సీ మూవీ నటుడు హరీష్ కల్యాణ్ జంటగా నటిస్తున్నారు. నటి నదియా,కమెడీయన్ యోగిబాబు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఇతర సాంకేతిక, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.