సన్ రైజర్స్ ఆటగాళ్లకు క్లాస్ పీకిన ధోని..

సన్ రైజర్స్ ఆటగాళ్లకు క్లాస్ పీకిన ధోని..

చెన్నై సూపర్ కింగ్స్ తో చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సన్ రైజర్స్ విసిరిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. అయితే మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోనీ సన్ రైజర్స్ ఆటగాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. 

క్లాస్ పీకాడు..

సన్ రైజర్స్ ఆటగాళ్లకు ఎంఎస్ ధోని తన అనుభవాలను పంచుకున్నాడు. కొన్ని సలహాలు, సూచనలను అందించాడు.  ధోనీ మాటలను సన్‌రైజర్స్ ఆటగాళ్లు శ్రద్దగా విన్నారు. ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, కార్తీక్ త్యాగీ‌ వంటి ఆటగాళ్లతో ధోనీ ముచ్చటించాడు.  ఆ తర్వాత ఆటగాళ్లంతా ధోనితో  ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ధోనిపై ఉతప్ప ప్రశంసలు..

సన్ రైజర్స్ ఆటగాళ్లకు ధోని సలహాలు, సూచనలు ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసలు కురిపించాడు. ధోని సలహాలు యువ ఆటగాళ్లకు ఉపయోగపడతాయన్నాడు. ధోనీని ప్రశ్నలు అడగడం.., అతని అనుభవాలు తెలుసుకోవడం ఆటగాళ్లకు గొప్ప  వరమన్నాడు. యువ ఆటగాళ్లే కాకుండా.... కొన్ని ఫ్రాంచైజీల కోచ్‌లు, కెప్టెన్లు కూడా ధోనీ సలహాలు తీసుకోవాలని సూచించాడు.