దీదీ.. ఎన్నికల సమయానికి మీరు ఒంటరిగా మిగులుతారు

దీదీ.. ఎన్నికల సమయానికి మీరు ఒంటరిగా మిగులుతారు

మమతా దీదీ.. ఇది కేవలం ఆరంభమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో మీరు ఒంటరిగా మిగిలిపోతారంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి కేంద్రమంత్రి అమిత్‌షా అన్నారు. బెంగాల్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన శనివారం మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సువేందు అధికారిని సాదరంగా బీజేపీలోకి స్వాగతం పలికారు. ఇందులో భాగంగా మాట్లాడిన అమిత్ షా… మేనల్లుడిని సీఎం చేయడానికే దీదీ పాటుపడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లేదని,TMC గద్దె దిగితేనే రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఐదేళ్లు అవకాశమిస్తే.. రాష్ట్రాన్ని స్వర్ణబెంగాల్‌ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 200కి పైగా స్థానాల్లో విజయం సాధించి బెంగాల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అవినీతి, అధికార దుర్వినియోగం, బంధుప్రీతి కారణంగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ నుండి చాలా మంది నేతలు వైదొలుగుతున్నారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఎన్నికల సమయానికి దీదీ ఒంటరిగానే మిగులుతారని స్పష్టంచేశారు కేంద్ర మంత్రి అమిత్ షా.