హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సెంట్రల్ఎలక్షన్ కమిషన్ ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తామని షెడ్యూల్లో పేర్కొన్నది. నిజంగా అదే జరిగితే రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరనున్నాయి. తెలంగాణలో రెండు, ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్నాయని, వాటికి ఈనెల11న వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఈసీ అండర్సెక్రటరీ ప్రఫుల్అవస్తీ గురువారం షెడ్యూల్ప్రకటించారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు సీట్ల పదవీకాలం 2027 నవంబర్30వ తేదీతో ముగియనుంది. యూపీ నుంచి ఖాళీ అయిన స్థానం పదవీకాలం 2027 జనవరి 30వ తేదీ వరకు ఉంది.
సీఈసీ ఎమ్మెల్సీ షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తెలంగాణ సీఈవో వికాస్రాజ్ఈ ఎన్నికలపై ప్రెస్రిలీజ్ఇచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సీఈసీ ప్రకటించిన షెడ్యూల్ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చిన షెడ్యూల్లో తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు, యూపీలోని ఒక సీటుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. ఈ లెక్కన ఈనెల11న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరు ఎన్నికల నోటిఫికేషన్ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగి.. పదవీకాలం కూడా ఒకేసారి ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ఇస్తే తప్ప ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ షెడ్యూల్లో పేర్కొన్నట్టుగానే వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు ఇస్తే అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా రెండు స్థానాల్లో కాంగ్రెస్అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఒకవేళ రెండు సీట్ల భర్తీకి ఒకే నోటిఫికేషన్జారీ చేస్తే మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తలా ఒక స్థానం దక్కుతాయి.