తల్లిని హత్య చేసిన కేసులో కొడుకుకు జీవిత ఖైదు.. కొత్తగూడెం కోర్టు జడ్జిమెంట్

తల్లిని హత్య చేసిన కేసులో కొడుకుకు జీవిత ఖైదు.. కొత్తగూడెం కోర్టు జడ్జిమెంట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తల్లిని హత్య చేసిన కేసులో కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ మంగళవారం తీర్పు నిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్​ ప్రాంతంలోని తిలక్​నగర్​కు చెందిన లోద్​ దులారీబాయి, శ్యాంలాల్​ దంపతుల కొడుకు లోద్​రమేశ్​ మద్యానికి బానిసై తరుచూ తల్లిదండ్రులు, భార్యతో గొడవ పడేవాడు. 

బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లగా, పోలీసులు కౌన్సెలింగ్​ ఇచ్చి, పెద్దలు పంచాయితీ పెట్టి ఇద్దరిని కలిపారు. ఈక్రమంలో గత ఏడాది మే 10న చికెన్​ తీసుకువచ్చి వండమని తల్లికి ఇచ్చాడు. చికెన్​ సరిపోలేదని తల్లిపై కత్తి, ఇనుప రాడ్​తో దాడికి దిగాడు. అడ్డు వచ్చిన తండ్రితో పాటు కొడుకులను కొట్టి పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన వారిని బంధువులు హాస్పిటల్​కు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ దూలారీబాయి చనిపోయింది. 

కొత్తగూడెం టూ టౌన్​ పోలీసులు రమేశ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో 15 మంది సాక్షులను విచారించగా, నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.