కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్కు కసరత్తు!.. 50 ఏండ్ల తర్వాత ప్లాన్ కు రూపకల్పన

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్కు కసరత్తు!..   50 ఏండ్ల తర్వాత ప్లాన్ కు  రూపకల్పన
  • డ్రోన్​ టెక్నాలజీ ద్వారా డిజిటల్​ మ్యాపింగ్​
  • వచ్చే 20ఏండ్లకు సరిపడేలా ప్లానింగ్​
  • జీఎస్​ఐ ఆధారిత మాస్టర్​ ప్లాన్​ ను రూపొందించాలి 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​ మాస్టర్​ ప్లాన్​ రూపొందించడంలో తొలి అడుగు పడింది. మున్సిపాలిటీ నుంచి కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పడిన తర్వాత అమృత్​ స్కీం 2.0లో భాగంగా ఎట్టకేలకు మాస్టర్​ ప్లాన్​ను రూపకల్పనకు ఆఫీసర్లు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కొత్తగూడెంకు మాస్టర్​ ప్లాన్​ తయారవుతోంది. వచ్చే 20 ఏండ్లకు సరిపోయేలా ఈ మాస్టర్​ ప్లాన్​ రూపొందిస్తున్నారు. డ్రోన్​ టెక్నాలజీతో డిజిటల్​ మ్యాపింగ్​ చేయనున్నారు. 

లక్షకు చేరిన కొత్తగూడెం జనాభా.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో 50 ఏండ్ల కిందట మాస్టర్​ ప్లాన్​ రూపొందించారు. అదే ప్లాన్​ ఇప్పటి వరకు కొనసాగుతోంది. కొత్తగూడెం జనాభా లక్షకు చేరింది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​ మండలంలోని సుజాతనగర్​, నర్సింహ సాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెం గ్రామపంచాయతీలను కలుపుతూ 85.22చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ లో గెజిట్​ రిలీజ్​ చేసింది. ఈ క్రమంలో అమృత్​ 2.0 స్కీంలో మాస్టర్​ ప్లాన్​ రూపొందించే పనికి ఆఫీసర్లు శ్రీకారం చుట్టారు. 

డిజిటల్​ మ్యాపింగ్..

కొత్తగూడెం కార్పొరేషన్​ మాస్టర్​ ప్లాన్​ను అధునాతన పద్ధతిలో నిర్వహించనున్నారు. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రోన్​లతో మాస్టర్​ ప్లాన్​ను రూపొందించారు. ఇప్పుడు కొత్తగా కొత్తగూడెం మున్సిపల్​ కార్పొప్పొరేషన్​ కు మాస్టర్​ ప్లాన్​ను డ్రోన్​ టెక్నాలజీ ద్వారా డిజిటల్​ మ్యాపింగ్ చేయనున్నారు. జీఎస్​ఐ ఆధారితంగా మాస్టర్​ ప్లాన్​ను రూపొందించేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే 20 ఏండ్లకు అవసరమయ్యేలా భవిష్యత్​ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను  రూపొందించనున్నారు. 

ప్లాన్​ పక్కాగా నిర్వహిస్తేనే..

కొత్తగూడెం, పాల్వంచతో పాటు కార్పొరేషన్​లో కలిసిన సుజాతనగర్​లోని ఏడు గ్రామపంచాయతీలపై సమగ్రంగా మాస్టర్​ ప్లాన్​ రూపొందించాల్సిన అవసరం ఉందని నగర వాసులు పేర్కొంటున్నారు. మాస్టర్​ ప్లాన్​ లేక ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో గవర్నమెంట్​ ల్యాండ్స్​ఆక్రమణలకు గురయ్యాయి. కొత్తగూడెంలోని పెద్ద బజార్, చిన్న బజార్​, లేపాక్షి హోటల్​ రోడ్, ఎంజీ రోడ్​లలో పలు గల్లీలు కబ్జా అయ్యాయి.  ఈ మాస్టర్​ ప్లాన్​లో అన్ని అంశాలను తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. 

అవగాహన కార్యక్రమం.. 

అమృత్​ 2.0  స్కీంలో భాగంగా జీఎస్​ఐ ఆధారిత మాస్టర్​ ప్లాన్​ను పక్కాగా రూపకల్పన చేయాలని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో డీటీసీపీ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ అశ్విని ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ మాస్టర్​ ప్లాన్​ రూపకల్పనపై నిర్వహించిన అవగాహన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. సమగ్ర సమాచారం ఆధారంగా డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ను రూపొందించాలన్నారు. భవిష్యత్​కు ఉపయోగపడేలా మాస్టర్​ ప్లాన్​ ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. మాస్టర్​ ప్లాన్​ రూపకల్పన ప్రక్రియను ఆర్​డీఓలు తహసీల్దార్లు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. మాస్టర్​ రూప కల్పనపై స్పెషల్​ మీటింగ్స్​ను నిర్వహించనున్నట్టు చెప్పారు.