హీరో శర్వానంద్(Sharwanand), నిర్మాత దిల్ రాజు(Dil Raju) కెరీర్ లో స్పెషల్ సినిమా అంటే శతమానం భవతి(Shathamanam bhavathi) అని చెప్పాలి. కుటుంబ బంధాలు, వాటి విలువల గురించి వివరిస్తూ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2017 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. హిట్ అవడమే కాదు ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అందుకే ఆయన కూడా తన సినీ కెరీర్ లో శతమానంభవతి చాలా స్పెషల్ ఫిలిం అని చాలాసార్లు చెప్పుకొచ్చారు.
అయితే దాదాపు 9 ఏళ్ళ తరువాత ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. ఇతీవల సంక్రాంతి కానుకగా వచ్చే సంక్రాంతికి శతమానంభవతి కి సీక్వెల్ రానుంది అంటూ ప్రకటించాడు. పార్టీ వన్ లో శర్వానంద్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. తన అద్భుతమైన నటనతో సినిమాలోని ఎమోషన్ ను బాగా పండించాడు. అయితే.. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అన్నప్పుడు దాదాపు అదే హీరో ఉండటం సహజమే. అయితే ఈసారి మాత్రం హీరోను మార్చే పనిలో ఉన్నాడట దిల్ రాజు. ఈ సీక్వెల్ కోసం దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ ను తీసుకోనున్నారట.
ALSO READ :- Ajith Kumar: హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో..ఆందోళనలో ఫ్యాన్స్..!
ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే పెళ్లిచేసుకున్న ఈ హీరో త్వరలోనే తన రెండో సినిమా లవ్ మీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడు ఏకంగా శతమానంభవతి లాంటి సూపర్ హిట్ సీక్వెల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే.. ఈ సీక్వెల్ కు చిత్ర నిర్మాత దిల్ రాజునే కథను అందించనున్నాడట. అందుకే ఈ సినిమా కోసం తన కొడుకు ఆశిష్ ను తీసుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న శతమానంభవతి సినిమా ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. సీక్వెల్ లో కూడా శర్వానే తీసుకోండి సార్... ఆశిష్ తో వర్కౌట్ అవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై దిల్ రాజు ఎలా స్పందింస్తారో చూడాలి.