దిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం

దిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం

వాగుపై వంతెన కోసం దిందా గ్రామస్థులు చేపట్టిన దీక్ష విరమించారు. వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. మౌలిక వసతులు కల్పించాలంటూ గ్రామస్తులు ఆరు రోజులుగా దిందా వాగు వద్ద దీక్ష చేపట్టారు.  అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్కు వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు.

చింతల మానేపల్లి మండలం దిందా గ్రామస్థులు దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లోని కలెక్టరేట్కు చేరుకున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి బీజేపీతో పాటు బీఎస్పీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. గ్రామస్థుల ధర్నా నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.