టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్(NSR Prasad) (49) కన్నుమూశారు. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన నిరీక్షణ" చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.. సీతారామ్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడయ్యారు. అయన అకాల మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

మొదటి సినిమా నిరీక్షణతో దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్న ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.. ఆ తరువాత హీరో శ్రీకాంత్ తో "శత్రువు", నవదీప్ తో "నటుడు" వంటి చిత్రాలను చేశారు. అంతేకాదు.. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన "రెక్కి" విడుదలకు సిద్ధంగా ఉంది.