
థియేటర్స్ లో హనుమాన్(HanuMan) హంగామా కాస్త తగ్గడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇటీవల మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 8న హనుమాన్ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. శివరాత్రి రోజున ఫ్యామిలీతో కలిసి హనుమాన్ సినిమా చూసేయొచ్చు అని అనుకున్నారు.
కానీ, వాళ్ళకి నిరాశే ఎదురైంది. ఆరోజున హనుమాన్ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ విషయంపై జీ5 సంస్థ స్పందిస్తూ.. కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ కారణంగా హనుమాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయలేకపోయాము. అతి త్వరలో కొత్త డేట్ ను ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అప్పటినుండి హనుమాన్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అయితే.. మరో డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి నాలుగురోజులు గడుస్తున్నా.. మేకర్స్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.
#HanuMan OTT streaming date announcement is coming! ???
— Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024
అయితే.. ఆడియన్స్ హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో కాస్త డిజప్పాయింట్ లో ఉన్న వేల.. ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే హనుమాన్ ఓటీటీకి రానున్నట్లు సోషల్ మీడియా షేర్ చేశాడు. అయితే.. ప్రశాంత్ వర్మ ట్వీట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మాకు నమ్మకం లేదు దొర అని కొంతమంది అంటుంటే.. మరికొందరేమో.. ఇంట్రెస్ట్ పోతోంది అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.