ఈవెంట్కు రమ్మంటే రూ.2 లక్షలు అడిగాడు.. సుమన్పై దర్శకుడు శివనాగు ఫైర్

ఈవెంట్కు రమ్మంటే రూ.2 లక్షలు అడిగాడు.. సుమన్పై దర్శకుడు శివనాగు ఫైర్

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ పై దర్శకుడు శివనాడు ఫైర్ అయ్యాడు. ఆయన దర్శకత్వలో వస్తున్న లేటెస్ట్ మూవీ నవరత్నాలు. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫెమ్ ఇనాయ సుల్తానా, రంగస్థలం మహేష్, సుదర్శన్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఆడియో రరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో సహా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు శివనాగు.. నవరత్నాలు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే నటుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు శివనాగు.. "నేను పిలిస్తే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళు ఈ ఈవెంట్ కు వస్తారు. నేను సినీ పరిశ్రమలో పడ్డ కష్టాల ఆధారంగానే నవరత్నాలు సినిమా చేశాను. నేను ఒక హీరోతో వరుసగా మూడు సినిమాలు చేశాను. అతనితో నాకు మంచి బంధమే ఉంది. అతన్ని ఈ ఈవెంట్ కి గెస్ట్ గా పిలవమని పలువురు చెప్తే సరే అని కాల్ చేశాను. పదిరోజులు తిప్పించుకొని రెండు లక్షలు ఇస్తే వస్తా అన్నాడు. ఆ హీరో ఎవరో కాదు సుమన్. నా ఈవెంట్ కి నీకు డబ్బులిచ్చి పిలిచి, సన్మానం చేసి, నీ గురించి మంచిగా మాట్లాడాలా అంటూ" ఫైర్ అయ్యారు శివనాగు. 

ప్రస్తుతం శివనాగు చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ ఇష్యూపై నటుడు సుమన్ ఎలా స్పందిస్తాడో  చూడాలి.