
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా(Keedaa Cola). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే.. ఈ సినిమాపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Balasubramanyam) కుమారుడు ఎస్పీ చరణ్(SP Charan) ఈ సినిమా మేకర్స్ కు లీగల్ నోటీసులు. కీడా కోలా సినిమాలో తన తండ్రి వాయిస్ ను వాడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్ కు నోటీసులు పంపారు.
అయితే తాజాగా ఈ వివాదంపై తొలిసారి స్పందించాడు కీడా కోలా దర్శకుడు తరుణ్ భాస్కర్. రీసెంట్ గా ఆయన తులసివనం సినిమా మూవీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా రిపోర్టర్స్ ఈ వివాదం గురించి ప్రస్తావించగా.. ఈ వివాదం కేవలం సమాచార లోపం వల్ల జరిగింది మాత్రమే. ఇటు మా వైపు నుండి, అటు చరణ్ వైపు నుండి కూడా. సాధారణంగా సినీ మేకర్స్ ఏదైనా కొత్త ట్రై చేయాలి, ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని అందించాలనే ఆలోచనతోనే ఉంటారు. అంతేకాని, మన ఇండస్ట్రీ ప్రముఖులను అగౌరపరచాలని అనుకోరు. అంతకుమించి ఏమీలేదు. నేను చేసేవి చిన్న సినిమాలు, నాది కమర్షియల్ మెంటాలిటీ కూడా కాదు.. అంటూ క్లారిటీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చేసిన ఈ కామెంట్స్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
We intended to honour a Legend like SPB Garu utilising AI. There was a communication gap between us & SP Charan Sir & it is resolved.
— Aakashavaani (@TheAakashavaani) March 16, 2024
says #TharunBhascker about the notices that SP Charan sent to the Keedaa Cola team for recreating SPB’s voice using AI in the film. pic.twitter.com/GyNTD3spgQ