
హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెం ట్, కాంగ్రెస్ సీనియర్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం బేగంపేట క్యాంపు ఆఫీస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్లో శ్రీధర్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జీవితాంతం కాంగ్రెస్ కోసం పని చేసిన ఆయనను నిర్లక్ష్యం చేశారన్నారు. బీఆర్ఎస్లో ఆయనకు సరైన గౌరవం కల్పిస్తామని చెప్పారు. తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారని, వాళ్లను సరైన విధంగా గౌరవించుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి కోరారు.
కాంగ్రెస్లో నాకు చోటు లేకుండా చేశారు: శ్రీధర్
కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం, చెమట ధారపోసినా తనకు స్థానం లేకుండా చేశారని నందికంటి శ్రీధర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావును ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నిస్తానన్నారు. శ్రీధర్తో పాటుకాంగ్రెస్ సీనియర్ నాయకులు డోలి రమేశ్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, సూర్యప్రకాశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కూర్మయ్యగారి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.